గజ్జె కడుతున్న క్రైస్తవం, గాజులు తొడుక్కున్న హిందుత్వం
హిందువులూ, ముఖ్యంగా వెనుకబడిన తరగతులకి చెందని వారు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది..
ఆర్ధిక స్థితిగతుల ఆధారం గా కాకుండా, కుల మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తూ ఇప్పటికే దేశాన్ని కులాల కుంపటి గా చేసిన ఈ నాయకులు అంతటితో ఆగక ఇప్పుడు మత చిచ్చు ని కొత్త కోణం లో ఆవిష్కరిస్తున్నారు..
దళిత క్రైస్తవులకు, ముస్లిం లకు ఎస్.సి రిజర్వేషన్లు అన్న నిన్నటి మంత్రివర్గ తీర్మానం ఎంత బుద్దిలేని తీర్మానమో ఒక సారి చూద్దాం.
నేటి వరకు దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ లకి ప్రాతిపదిక ఏంటి? ఈ ఈ కులాలు ఓ.సి , ఈ ఈ కులాలు బీ.సి , ఆ ఆ మతానికి చెందినా వారు బీ.సి A, B, C, D ఇంకా రక రకాలు గా వర్గీకరించారు.. మరి ఇప్పుడు దాని ఆధారంగా చూసినా ఈ మార్పులు ఎందుకు? ఎవర్ని తృప్తి పరచడానికి? అనేది ఆలోచించండి.. ప్రస్తుత ముఖ్యమంత్రి రంగులు మార్చినంత తేలిక గా మతాలూ మారుస్తాడు.. ఈ రోజు ఇజ్రాయిలు వెళ్లి వచ్చి నేను క్రీస్తు బిడ్డని అంటాడు, రేపు తిరుమల లో వెంకటేశ్వరుడి దగ్గర పూజ చేస్తూ నేను రెడ్డి వాడిని అంటాడు.. వీళ్ళ ప్రభుత్వానికి వీళ్ళ పార్టీ కి అండగా వుంటున్నారు కాబట్టి ముస్లింలకీ వీళ్ళు ప్రత్యేకం గా సేవలు చెయ్యాలి..
మత ప్రాతిపదికన ప్రస్తుత రిజర్వేషన్లు నడుస్తున్నప్పుడు మరి ఆ మతమే మాకొద్దు అని బయటకు వెళ్ళిన వారికి మరి ఆ మతానికి చెందిన రిజర్వేషన్లు మాత్రం ఎందుకు? వేషానికి క్రిస్టియన్ ని, సమాజంలో చెప్పుకోటానికి క్రిస్టియన్ ని, కాని రిజర్వేషన్ లని అడుక్కొటానికి వచ్చే సరికి మాత్రం నేను దళితున్ని.. ఇదేనా దళిత క్రైస్తవుల వాదన? ఈ వితండ వాదానికి ఈ సగం క్రిస్టియన్ నాయకుడు తీర్మానం చెయ్యడం, దాన్ని ఆఖరుకి టి.డి.పి కూడా మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు..
హిందూ మతానికి చెందిన దేవుడు వద్దు, హిందూ మత సాంప్రదాయాలైన గుడి, బొట్టు, కాటుక, పూలు, గాజులు వద్దు, ఇంకా ఏంటి తాలీ వద్దు ఉంగరం మారుస్తాం, పుట్టిన మతం వద్దు, ఆ దేవుడు వద్దు, ఆ ఆచారాలు వద్దు.. మరి అలాంటప్పుడు ఆ మతానికి చెందిన వాళ్ళ రిజర్వేషన్ లు మాత్రం ఎందుకు? ఎందుకు అది మాత్రం మాకు కావాలి అని అడుక్కోవడం?
వెనుకపడిన తరగతులకి చెందని వారు జాగ్రత్త అని చెప్పడం ఎందుకంటే, ఇప్పటి కే ఎస్.సి , ఎస్.టీ ల లోని కొందరు నాయకులు , విద్యార్ధులు, మనుషులు ప్రతి అడ్డమైన దానికి "నేను దళితున్ని" కాబట్టి అని దళితులు అంటే ఎవరో వేరే ప్రపంచానికి చెందిన వారైనట్లు, వారూ మనలో ఒకరు కానట్లు , నోటికొచ్చింది వాగి చివరికి ఎస్.సి, ఎస్.టీ ఆట్ర సిటి కేసులు పెడుతున్నారు.. ఇప్పుడు ఆ తరగతుల్లోకి ఇంకా కొన్ని కోట్ల మంది వచ్చి చేరబోతున్నారు.. కాబట్టి, నిన్నటి దాక్క మీ మీద నోటికొచ్చింది వాగి, మిమ్మల్ని కొట్టి తిరిగి మీ పైనే కేసులు పెట్టె వాళ్ళు ఒక వంద మంది వుంటే, రేపటి నుంచి అలాంటి వాళ్ళు ఒక నూటా యాబయ్యి మంది వుంటారు.. కాబట్టి జాగ్రత్త సుమీ..
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,