సిడ్ని లో అంజన ప్రొడక్షన్స్
"మగధీరతో" సూపర్ సక్సెస్ అందుకున్న రాంచరణ్ , బొమ్మరిల్లు చిత్రం తో హిట్ కొట్టిన జేనేలియా, దర్శకులు భాస్కర్ కలయికలో అంజన ప్రొడక్షన్స్ సంస్థ తమ ఐదవ చిత్రం గా ఓ చిత్రాన్ని రూపొందిస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారం నుండి సిడ్ని లో షూటింగ్ జరుపుకోనుంది.
ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత నాగబాబు మాట్లాడుతూ డిశంబర్ 11 నుండి 20 వరకు ముoబై లో మొదటి షెడ్యూల్ లో కొన్ని కీలక సమావేశాలు చిత్రీకరించాం . ఫిబ్రవరి మొదటి వారం నుండి సిడ్ని లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. మా బ్యానర్ లో హైటేక్నికల్ వాల్యూస్ తో కంప్రమైజ్ అన్న పదానికి తావు ఇవ్వకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. "బొమ్మరిల్లు", "పరుగు" వంటి ట్రేమండస్ హిట్ చిత్రాల దర్శకుడు భాస్కర్ తో పనిచేయడం అందంగా ఉంది. అలాగే రాం చరణ్ మగధీర తర్వాత మా బ్యానర్ లో చేస్తున్నాము ఈ చిత్రం అందరి అంచనాలు అందుకునే (ఆ రేంజ్ మగధీర) అధిగమించే విధంగా ఉంటుందని అన్నారు.





For more news on current affairs and andhra pradesh politics, visit
anigalla.net | apolitical & a political. Thank you.